అలీబాబా గ్రూప్ ఈ ఏడాది ఇండియాలో ఆన్లైన్ వ్యాపారాలను ప్రారంభించాలని చూస్తోంది. తన సబ్సిడరీ యూసీవెబ్ ద్వారా పూర్తి తరహాలో ఈ–కామర్స్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్టు కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. అలీబాబా గ్రూప్ ఇండియాలో ఈ–కామర్స్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టడం, పేటీఎంపై ఎలాంటి ప్రభావం చూపదని యూసీవెబ్ గ్లోబల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ హువైయువాన్ యాంగ్ అన్నారు. ఇండియాలో ఈ–కామర్స్లో అపార అవకాశాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పేటీఎంలో అలీబాబా గ్రూప్కు 30.15 శాతం వాటాలున్నాయి. స్నాప్డీల్లో కూడా అలీబాబాకు 3 శాతం వాటా ఉంది. ఆన్లైన్ మూవీ టిక్కెట్లు అమ్మాలని కూడా యూసీవెబ్ చూస్తున్నట్టు యాంగ్ తెలిపారు. ఫ్లిప్కార్ట్లో అమెరికన్ కంపెనీ వాల్మార్ట్ 70 శాతం వాటాలు కొనుగోలు చేసింది. మరో ఈ–కామర్స్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ సహా పలు ఆఫ్లైన్ రిటైల్ కంపెనీల్లో వాటాలు తీసుకుంది.ఈ నేపథ్యంలో అలీబాబా ఈ నిర్ణయం తీసుకుంది.