కేంద్ర వైఫల్యం వల్లే కరోనా సెకండ్ వేవ్ విజృంభణ

కేంద్ర వైఫల్యం వల్లే కరోనా సెకండ్ వేవ్ విజృంభణ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ మాజీ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. కేంద్ర సర్కార్ వైఫల్యం వల్లే దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాలసీలు పూర్తిగా విఫలమయ్యాయని, వలస కూలీలు పారిపోయే పరిస్థితులు తలెత్తాయని దుయ్యబట్టారు. మంచి సలహాలను స్వీకరించే స్థితిలో మోడీ సర్కార్ లేదన్నారు. 'వ్యాక్సినేషన్ కంటే ముందు ప్రజల దగ్గర డబ్బులు ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. సాధారణ ప్రజానీకం బాగోగులతోపాటు దేశ ఎకానామీ దృష్ట్యా వారి చేతుల్లో డబ్బులు ఉండేలా చూడాలి. కానీ ఇలాంటి మంచి సూచనలను తీసుకునే స్థితిలో అహంకార ప్రభుత్వం లేదు' అని రాహుల్ ట్వీట్ చేశారు.