సివిల్ సప్లయ్స్ లో గోల్ మాల్ పై సీఎంకు లేఖ రాస్తా : ఏలేటి

సివిల్ సప్లయ్స్ లో గోల్ మాల్ పై సీఎంకు లేఖ రాస్తా : ఏలేటి

హైదరాబాద్,వెలుగు:  సివిల్ సప్లై శాఖలో జరిగిన రూ.1,150 కోట్ల గోల్ మాల్​పై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తానని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో చిట్ చాట్ చేశారు. సివిల్ సప్లై శాఖపై పూర్తి ఆధారాలను శనివారం బహిర్గతం చేస్తానన్నారు. కమీషన్ల కోసం మంత్రి ఉత్తమ్ అగ్రిమెంట్ రాసుకున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడమే ప్రజాపాలననా? అని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.