హరీష్​ శంకర్​తో మరోసారి అల్లు అర్జున్!

హరీష్​ శంకర్​తో మరోసారి అల్లు అర్జున్!

టాలీవుడ్ ​డైరెక్టర్ హరీష్ శంకర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబో మరోసారి రిపీట్​ కాబోతుంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అసలు విషయంలోకి వెళ్లితే.. అది సినిమా కాదు కేవలం ఒక యాడ్ ఫిలిం మాత్రమే అని తెలుస్తోంది. టాలీవుడ్ దర్శకులు ఒకపక్క సినిమాల డైరెక్షన్ చేస్తూనే మరోపక్క యాడ్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది క్రిష్, త్రివిక్రమ్ లాంటి దర్శకులు కూడా ఇలా యాడ్ ఫిలిమ్స్ చేయడంలో అనుభవం సంపాదించారు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా అదే విధంగా ఒక యాడ్ ఫిలిం చేయబోతున్నాడు. 

తాజాగా ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అల్లు అర్జున్‌తో కలిసి బయటకు వెళ్లడం ఎప్పుడూ ఓ ఫన్ రైడ్ లాగే ఉంటుంది. ఇద్దరం కలిసి ఒక యాడ్ షూట్ చేయబోతున్నాం. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది అంటూ హరీష్ శంకర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇద్దరూ కలిసి ఈ షూట్ కోసం బ్యాంకాక్ వెళ్తున్నారని సమాచారం

కాగా, గతంలో అల్లు అర్జున్ హీరోగా దువ్వాడ జగన్నాధం సినిమా రూపొందించారు హరీష్ శంకర్. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా.. ఈ సినిమా విడుదల తర్వాత బన్నీ ఖాతాలో మరో సూపర్ హిట్ పడింది. ఇక ప్రస్తుతం బన్నీ ‘పుష్ప2’ కోసం సిద్ధమవుతున్నారు. ‘పుష్ప’పార్ట్ 1 సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2పై అంచనాలు పెరిగిపోయాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harish Shankar (@harish2you)