- రిటైర్మెంట్ నిర్ణయం ఉపసంహరణ
- విజయ్ హజారే ట్రోఫీతో రీ ఎంట్రీ!
హైదరాబాద్, వెలుగు: వరల్డ్కప్కు సెలెక్ట్ చేయలేదన్న ఆవేదనతో కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ అంబటి రాయుడు మనసు మార్చుకున్నాడు. గత నెలలో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న రాయుడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. ఈ మేరకు 2019–20 డొమెస్టిక్ సీజన్ లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్లో హెచ్సీఏ తరఫున బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని హెచ్సీఏ సీఈఓ గురువారం ప్రకటించారు. అయితే, అంబటి తాజా నిర్ణయం దేశవాళీలకే పరిమితమా లేక ఇంటర్నేషనల్ క్రికెట్కు కూడా వర్తిస్తుందో చూడాలి. ఐపీఎల్తో పాటు మళ్లీ ఇండియాకు ఆడాలని ఆసక్తిగా ఉన్నానని రాయుడు ఇటీవలే హింట్ ఇచ్చాడు. ఈ లెక్కన ఇండియాకు మళ్లీ ఆడాలని ఆశిస్తున్నట్టు అర్థమవుతోంది. వచ్చే నెల 24న మొదలయ్యే విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరఫున రాయుడు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి అంబటి గతంలోనే తప్పుకున్నాడు.