పార్లమెంట్ కొత్త బిల్డింగ్​కు అంబేద్కర్ పేరు పెట్టాలె:ఎంపీ నామా

పార్లమెంట్ కొత్త బిల్డింగ్​కు అంబేద్కర్ పేరు పెట్టాలె:ఎంపీ నామా

న్యూఢిల్లీ, వెలుగు: కొత్తగా నిర్మిస్తోన్న పార్లమెంట్ భవనానికి డా. బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్ సబ పక్షనేత నామా నాగేశ్వర్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అప్పుడే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆంకాక్షలను నెరవేర్చినట్లు అవుతుందని అన్నారు. ఇదే సందర్భంలో తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ కు రాష్ట్ర సర్కార్​ అంబేద్కర్ పేరు పెట్టినట్లు సభకు వెల్లడించారు. బుధవారం లోక్ సభలో రాజ్యాంగం(షెడ్యూల్ ట్రైబ్స్) ఆర్డర్ (ఐదవ సవరణ) బిల్లు –2022 బిల్లుపై చర్చలో టీఆర్ఎస్ తరఫున నామా పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 2017 లో తెలంగాణ సర్కార్ బిల్లు ను ఆమోదించి కేంద్రానికి పంపిందన్నారు. అలాగే, ఎస్సీ వర్గీకరణపై 2014 తెలంగాణ అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు గుర్తుచేశారు. ఈ రెండింటిపై ఇప్పటి వరకు కేంద్ర సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన వర్గాల కోసం కేంద్రం ఆలోచించడం లేదన్నారు. తెలంగాణ సర్కార్ దళితులకు దళితబంధు పేరుతో రూ.10 లక్షలు అందిస్తోందని చెప్పారు. అలాగే, దేశంలోని గిరిజనులకు గిరిజనబంధు ఇవ్వాలని నామా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.