జోగులాంబ గద్వాల జిల్లాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో అపశృతి

జోగులాంబ గద్వాల జిల్లాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో అపశృతి
  • ఆపేందుకు ప్రయత్నించిన ఎస్ఐ కి గాయాలు

జోగులాంబ గద్వాల: జిల్లాలోని కేటిదొడ్ది మండలం ఇర్కిచేడులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెండు వర్గాలుగా విడిపోయిన విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు  విగ్రహ ఆవిష్కరణ సమయంలో గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని... ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకూ వినని ఓ వర్గం వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించారు. దీంతో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారికి నిప్పంటుకుంది. కాగా ప్రత్యర్థి వర్గం వారు వెంటనే స్పందించి.. అంబేద్కర్ విగ్రహానికంటుకున్న మంటలను ఆర్పేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకుని పరిస్థితులను చక్కదిద్దారు.

మరిన్ని వార్తల కోసం..

శ్రీశైలం షాప్‌లకు నిప్పుపెట్టిన కన్నడ భక్తులు

రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్