గ్రేటర్ వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు

గ్రేటర్ వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు

ముషీరాబాద్/పద్మారావునగర్/గండిపేట/శామీర్ పేట, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా జరిగాయి. ముషీరాబాద్​లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేవైఎం నగర అధ్యక్షుడు మద్దూరు శివాజీ నివాళి అర్పించారు. ఇందిరాపార్కు చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్ కటౌట్​కు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాల మహానాడు నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలోనూ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. 

ఎమ్మార్పీఎస్​, ఎంఎస్​పీ సికింద్రాబాద్ సెగ్మెంట్ నాయకులు డప్పు మల్లికార్జున్, ఎంఎస్​పీ హైదరాబాద్ జిల్లా కన్వీనర్  నలిమెల విజయరావు, ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ రుషిపాక గణేశ్ పాల్గొన్నారు. నార్సింగి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో అల్వాల్​లో నాయకులు నివాళి అర్పించారు. శామీర్ పేట, తూముకుంట, మూడు చింతలపల్లిలోనూ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు.