పంజాగుట్ట, వెలుగు: లోకాయుక్త ఆదేశాలను అమలు చేయాలని అమీర్పేటకు చెందిన సీనియర్సిటిజన్ లక్ష్మీనారాయణ కోరారు. అమీర్పేట నుంచి పంజాగుట్ట వరకు రహదారి విస్తరణ కోసం 2009లో ప్రభుత్వం సేకరించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని లోకాయుక్త ఆదేశాలిచ్చిందన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
లోకాయుక్త ఆదేశాలను అమలు విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అమీర్పేట చౌరస్తాలో 198 గజాల స్థలానికి ప్రభుత్వం రూ.86 లక్షల పరిహారం చెల్లించిందన్నారు. ఇప్పటికీ భూమిని స్వాధీనం చేసుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పరిహారం తీసుకున్నవారు సదరు స్థలంలో భారీ భవనం నిర్మించి, రూ.లక్షలు గడిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని కోరారు.
