కేజ్రీవాల్ ను కలిసిన సోనూసూద్

కేజ్రీవాల్ ను కలిసిన సోనూసూద్

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను కలిశారు నటుడు, సామాజికసేవకుడు సోనూ సూద్. ఢిల్లీ వెళ్లిన సోనూ సూద్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చడ్డా పాల్గొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న దేశ్ కే మెంటార్స్ ప్రోగ్రామ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసేందుకు సోనూ సూద్ అంగీకరించారని కేజ్రీవాల్ చెప్పారు. సరైన గైడెన్స్ లేక అనేకమంది విద్యార్థులు తమ కెరీర్ ను సరిగా డిజైన్ చేసుకోలేకపోతున్నారన్నారు కేజ్రీవాల్. అలాంటి లోపాలను సరిచేసేందుకే  దేశ్ కే మెంటార్స్ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నట్టు కేజ్రీ తెలిపారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ యువతకు అవసరమన్నారు సోనూ సూద్. సరైన మార్గనిర్దేశనం లేకనే... లాక్ డౌన్ ల టైమ్ లో ప్రజలు ఇబ్బందులు పడ్డారని సోనూ సూద్ గుర్తు చేశారు.