రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా ఫోన్.. ఈనెల 21న ఢిల్లీకి రావాలని పిలుపు

రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా ఫోన్.. ఈనెల 21న ఢిల్లీకి రావాలని పిలుపు

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా కార్యాలయం నుంచి  ఫోన్ వచ్చినట్లు సమాచారం. ఈనెల 21వ తేదీన ఢిల్లీకి రావాలని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఏ విషయంపై చర్చించేందుకు పిలిపించారనేది తెలియాల్సి ఉంది. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకే పిలిపించినట్లు తెలుస్తున్నా.. స్పష్టత రావాల్సి ఉంది. 
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘన విజయం ద్వారా పార్టీకి వచ్చిన ఊపును అన్ని నియోజకవర్గాలకు తీసుకెళ్లేలా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసేందుకే పిలిపించినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావుతోపాటు ముఖ్య నేతలు ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి అమిత్ షా కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి 


బాత్రూంలు బాగోలేవని బాలిక ఫిర్యాదు.. క్లీన్ చేసిన మంత్రి

ఐఏఎంసీకి హైదరాబాదే బెస్ట్ ప్లేస్: సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోవచ్చు.. పెళ్లి చేసుకోకూడదా?

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి?