బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు సుదీర్ఘకాలంపాటు సెక్రటరీగా పనిచేసిన 77 ఏళ్ల శీతల్ జైన్ కన్నుమూశారు. 40 ఏళ్లపాటు అమితాబ్కు కార్యదర్శిగా పనిచేసిన శీతల్ జైన్ ఆయన నటించిన ‘బడే మియా చోటే మియా’ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించారు.
విషయం తెలుసుకున్న బిగ్ బీ..ఆయన కుమారుడు నటుడు అభిషేక్ బచ్చన్ శీతల్ జైన్ కు నివాళులర్పించారు. అంతే కాదు ఆయన అంత్యక్రియల సందర్భంగా స్వయంగా అమితాబ్, అభిషేక్ పాడెను కొంత దూరం వరకు మోసి తమ గొప్ప మనసును చాటుకున్నారు.
శీతల్ జైన్ చాలా మంచి వ్యక్తి అని, సౌమ్యుడన్న అమితాబ్.. సినీ పరిశ్రమ ఓ మంచి వ్యక్తిని కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.