టూవీలర్పై వెళ్తుండగా ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

టూవీలర్పై వెళ్తుండగా ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

కరీంనగర్ : కరీంనగర్ -బొమ్మకల్ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. అక్టోబర్​ 8వ తేదీ రాత్రి కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి హౌసింగ్ బోర్జు కాలనీ వైపు టూవీలర్​ పై ఇద్దరు మహిళలు వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొంది.

ఈ ఘటనలో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సిరిమల్ల జ్యోతి (45) , మల్కాపూర్ కు చెందిన సౌజన్య(24) మృతిచెందారు. జ్యోతి.. ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్. సౌజన్య డిగ్రీ పూర్తి చేసి.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆదివారం రాత్రి కలిసి ఇద్దరూ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.