మహాలక్ష్మి స్కీం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వాగ్వాదం

మహాలక్ష్మి స్కీం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వాగ్వాదం

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్  ఘన్ పూర్ లో మహాలక్ష్మి స్కీం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్, బీఆర్ఎస్  నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టేషన్​ ఘన్​పూర్​ బస్టాండ్​లో పథకాన్ని ఆర్డీఓ రామ్మూర్తి , జడ్పీ స్టాండింగ్  కమిటీ చైర్మన్​ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ మహిళా లీడర్లు చింత జ్యోత్స, నారగోని పద్మ, మరికొందరు బస్సెక్కుతూ జై కాంగ్రెస్, జై సీఎం రేవంత్​ అంటూ నినాదాలు చేశారు.

దీంతో ఎంపీపీ కందుల రేఖ భర్త గట్టయ్య, ఎంపీటీసీ గన్ను నర్సింహులు ‘ఇది ప్రభుత్వ ప్రోగ్రాం.. నినాదాలు ఎందుకు చేస్తున్నారు’ అని అడ్డుకున్నారు.  ప్రతిగా జై బీఆర్ఎస్​ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆర్డీవో సమక్షంలో కాసేపు ఇరు పార్టీల లీడర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీపీ భర్త కందుల గట్టయ్య కాంగ్రెస్​ నాయకులపై మండిపడ్డారు. దీనిపై కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామన్నారు.