విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు

విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు

హైదరాబాద్ హయత్ నగర్లో దారుణం జరిగింది. శాంతినికేతన్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధిని అక్షయ ఆత్మహత్య చేసుకుంది.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. క్లాస్ లో విద్యార్థులు అల్లరి చేస్తున్నారని టీచర్ వారిని బయటకు పంపించింది. దీంతో మనస్తాపానికి గురైన అక్షయ ఆత్మహత్య  చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. క్లాస్ రూమ్ లో అసలేం జరిగిందనే విషయంపై తెలుసుకునేందుకు సీసీటీవీ పుటేజీను చూపించకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచుతుందని తెలిపారు. తమ కంటి కనుపాప కళ్లముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో  ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు స్కూల్ ముందు భారీగా మోహరించారు. విద్యార్థిని ఆత్మహత్యపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. అక్షయ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.