
హైదరాబాద్,వెలుగు: జంట నగరాల్లోని యువత డ్రగ్స్కు బానిసలు కాకూడదన్న నినాదంతో గురువారం బండ్లగూడ జాగీర్ పరిధిలోని షాదన్కాలేజీ నుంచి ‘ సే నో టు డ్రగ్స్’ ప్లకార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చీఫ్గెస్టుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ‘పల్సేషన్–2023 పేరుతో వార్షిక కల్చరల్, లిటరసీ, సోషల్, ఫుడ్ ఫెస్టివల్కార్యక్రమాన్ని మూడు ప్రధాన మెడికల్ ఇనిస్టిట్యూషన్లు షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డా. విఆర్కే విమెన్స్ మెడికల్కాలేజీ, అయాన్ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించాయి.
షాదన్ కాలేజీ నుంచి మొదలైన ర్యాలీ పీరంచెరు మీదుగా టీఎస్పీపీఏ(తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ) జంక్షన్ వరకు సాగింది. 2 వేల మంది మెడికల్ స్టూడెంట్లు, డాక్టర్లు, మెడికల్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు, డాక్టర్లతో పాటు ర్యాలీలో పాల్గొన్న సిటిజన్లతో కమిషనర్ శ్రీనివాస్రెడ్డి ‘సే నో టు డ్రగ్స్’ ప్రతిజ్ఞ చేయించారు.