బండ్లగూడ జాగీర్​లో సే నో టు డ్రగ్స్ ర్యాలీ

బండ్లగూడ జాగీర్​లో సే నో టు డ్రగ్స్ ర్యాలీ

హైదరాబాద్,వెలుగు: జంట నగరాల్లోని యువత డ్రగ్స్​కు బానిసలు కాకూడదన్న నినాదంతో గురువారం బండ్లగూడ జాగీర్ పరిధిలోని షాదన్​కాలేజీ నుంచి ‘ సే నో టు డ్రగ్స్’  ప్లకార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చీఫ్​గెస్టుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ‘పల్సేషన్​–2023 పేరుతో వార్షిక కల్చరల్​, లిటరసీ, సోషల్, ఫుడ్​ ఫెస్టివల్​కార్యక్రమాన్ని మూడు ప్రధాన మెడికల్ ​ఇనిస్టిట్యూషన్లు షాదన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ సైన్సెస్​, డా. విఆర్‌‌‌‌కే విమెన్స్ మెడికల్​కాలేజీ, అయాన్​ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించాయి. 

షాదన్​ కాలేజీ నుంచి మొదలైన ర్యాలీ పీరంచెరు మీదుగా టీఎస్పీపీఏ(తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ) జంక్షన్ వరకు సాగింది. 2 వేల మంది మెడికల్ స్టూడెంట్లు, డాక్టర్లు, మెడికల్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు, డాక్టర్లతో పాటు ర్యాలీలో పాల్గొన్న సిటిజన్లతో  కమిషనర్​ శ్రీనివాస్​రెడ్డి   ‘సే నో టు డ్రగ్స్’ ప్రతిజ్ఞ చేయించారు.