కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. రేవంత్ సర్కార్ లో గురుకులాల్లో రూ. రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని... గురుకులాల్లో అవినీతిపై చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు ఆర్ఎస్ ప్రవీణ్. ఈ క్రమంలో గన్ పార్క్ దగ్గరికి చేరుకున్నారు మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్. దీంతో గన్ పార్క్ దగ్గరభారీగా మోహరించారు పోలీసులు.
మరో పక్క కాంగ్రెస్ హయంలో రాష్ట్రంగా అప్పులకుప్పగామారిందని.. చర్చకు సిద్ధమంటూ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ లకు సవాల్ విసిరారు కేటీఆర్. ఇందుకు కౌంటర్ గా బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్లు అప్పు నిజమని.. కెటిఆర్ స్థాయికి రాహుల్, రేవంత్ అవసరం లేదని... తాను చాలని అన్నారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ హయాంలో అప్పులు అబద్దమైతే తాను రాజీనామాకు సిద్ధమని.. చర్చకు తెలంగాణ భవన్ కు వస్తానని కేటీఆర్ కు సవాల్ విసిరారు జూపల్లి.
ఈ క్రమంలో జూపల్లి సవాల్ ను స్వీకరిస్తామని అన్నారు కేటీఆర్, హరీష్ రావు. జూపల్లి తెలంగాణ భవన్ కు వచ్చి మాట నిలబెట్టుకోవాలని జూపల్లికి సవాల్ విసిరారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు.
