ఐరన్ కంపెనీలో భారీ పేలుడు

ఐరన్ కంపెనీలో భారీ పేలుడు
  • 8  మందికి తీవ్ర గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
  • రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘటన

షాద్ నగర్, వెలుగు: ఐరన్ కంపెనీలో పేలుడు జరిగి కార్మికులు గాయపడ్డ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గ్ లోని స్కాన్ ఎనర్జీ ఐరన్ కంపెనీలో మంగళవారం కార్మికులు ఐరన్​ను బట్టీలో అన్​లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగి మంటలు చెలరేగాయి. రెండు లారీలు, సామగ్రి కాలిపోయాయి.  

8 మంది కార్మికులు గాయపడగా.. వారిని వెంటనే హాస్పిటల్​కు తరలించారు. ఫైర్ సిబ్బంది కంపెనీ దగ్గరికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.  అయితే, గాయపడ్డ  కార్మికుల్లో రాజు యాదవ్, లాల్ బహదూర్, నారాయణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.