
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వరద బాధితుల సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సిబ్బంది సీఎం సహాయ నిధికి రూ.65 లక్షలు విరాళంగా అందించారు. బ్యాంకు చైర్మన్ కె. ప్రతాప రెడ్డి, బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మక్కడ్, చైర్మన్ సెక్రటరీ ఆర్. యశ్వంత్ సీఎం రేవంత్రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా తమ వంతు చేయూతను అందించిన ఏపీజీవీబీ కార్యవర్గం, సిబ్బందికి ఈ సందర్భంగా సీఎం ధన్యవాదాలు తెలిపారు.