ఏపీ పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.
ఎస్ఈసీ ఆదేశాలను పాటించి రిటర్నింగ్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే వారందరినీ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. దాంతో మంత్రి పెద్దిరెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు హౌస్ అరెస్ట్ చేయాలని డీజీపీని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. అంతేకాకుండా అప్పటివరకు ఆయనను మీడియాతో కూడా మాట్లాడనివ్వొద్దని నిమ్మగడ్డ ఆదేశించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.
For More News..