ఏపీ మాజీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠాకు పోస్టింగ్

ఏపీ మాజీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠాకు పోస్టింగ్

ఏపీ మాజీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠాకు పోస్టింగ్  ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడంతో సీఎస్ ఎల్. వి. సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. పునేఠాను ఎన్నికల విధులతో సంబంధం లేని శాఖలో నియమించాలని ఈసీ సూచించింది. అప్పటి నుంచి ఆయన వెయిటింగ్‌లోనే ఉన్నారు. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.