అంజయ్యనగర్లో మరో నాలుగు భవనాలను కూల్చివేతకు రంగం సిద్ధం

అంజయ్యనగర్లో మరో నాలుగు భవనాలను కూల్చివేతకు రంగం సిద్ధం
  • ఎనిమిది భవనాల్లో నాలుగు నేలమట్టం

గచ్చిబౌలి, వెలుగు: అంజయ్యనగర్​లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ప్రమాదరకంగా ఉన్న మూడు బిల్డింగ్​లను కూల్చివేసిన హైడ్రా అధికారులు.. మరో భవనాన్ని బుధవారం నేలమట్టం చేశారు. ఈ నెల 22న 50 గజాల్లో కట్టిన ఏడు అంతస్థుల భవనం కుప్పకూలి, ఇద్దరు కార్మికులు మృతిచెందిన విషయం తెలిసిందే. 

సీఎంసీ కమిషనర్ ఆదేశాలతో హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన, ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చివేస్తున్నారు. అంజయ్యనగర్​ వరద నీటి కాల్వ చుట్టూ ఇలాంటి ఎనిమిది బిల్డింగ్​లను గుర్తించి, వాటిలో ఇప్పటి వరకు నాలుగు భవనాలను నేలమట్టం చేశారు. మరో నాలుగింటిని తొలగించేందుకు సిద్ధమయ్యారు.