ఆప్ లో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ సోదరి

ఆప్ లో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ సోదరి

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఆప్ పార్టీ కార్యాలయంలో  బీజేపీ ముఖ్య నాయకుల సమక్షంలో ఆమె ఆప్ కండువా కప్పుకున్నారు. అంజూ కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్. గతంలో  హిందీ టీచర్ గా పనిచేసిన ఆమె పదేళ్ల క్రితం రాజకీయాల్లో చేరారు. 2012 మున్సిపల్ ఎన్నికల్లో దక్షిణ్ పురి వార్డు నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు.