వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వస్తి వచనంతో ఘనంగా ప్రారంభించారు అర్చకులు. వేల మంది భక్తులు చూసేలా కొండ కింద జెడ్పీ హైస్కూల్ ఆవరణలో కళ్యాణోత్సవం నిర్వహించేందుకు భారీ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 11 రోజులు పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి 7న అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.