లోన్‌ యాప్‌ వేధింపులకు మరొక వ్యక్తి బలి

లోన్‌ యాప్‌ వేధింపులకు మరొక వ్యక్తి బలి

కరీంనగర్‌ : ఆన్ లైన్ లోన్‌ యాప్‌ వేధింపులు తాళలేక రాష్ట్రంలో మరొక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గలిపల్లి గ్రామానికి చెందిన పవన్‌ కళ్యాణ్‌ రెడ్డి(24) ఆన్‌లైన్‌ మనీ లెండింగ్‌ పోర్టల్‌ నుంచి అప్పు తీసుకున్నాడు. సమయానికి తిరిగి చెల్లించలేకపోవ‌డంతో.. సదరు కంపెనీ టెలీకాలర్స్ త‌ర‌చూ కాల్ చేసేవారు. ఆ ఫోన్‌కాల్స్‌ను రెడ్డి ఆన్స‌ర్స్‌ చేయకుండా ఉండటంతో అతని కజిన్‌కి ఫోన్‌ చేసి లోన్‌ తిరిగి చెల్లించాలని చెప్పాల్సిందిగా పేర్కొన్నారు. విషయం బయటకి తెలియడంతో మనస్థాపం చెందిన కళ్యాణ్‌ శుక్రవారం నాడు ఆత్మహత్య చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బి.కే. రాహుల్‌ హెగ్డే తెలిపారు. ఇటువంటి అనధికార యాప్స్‌ నుండి ప్రజలు లోన్స్‌ తీసుకోకుండా ఉండాల్సిందిగా సీనియర్‌ పోలీసు అధికారులు సూచించారు.