కరోనా కారణంగా నీట్ రాయలేకపోయిన స్టూడెంట్స్ కు మరో అవకాశం

కరోనా కారణంగా నీట్ రాయలేకపోయిన స్టూడెంట్స్ కు మరో అవకాశం

కరోనా కారణంగా నీట్ రాయలేకపోయిన స్టూడెంట్స్ కు మరో అవకాశం ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రప్రభుత్వం. గతంలో ఎగ్జామ్ రాయలేకపోయిన విద్యార్థులకు ఈ నెల 14న ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపింది. 16న ఫలితాలు ప్రకటిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా సోకి గతంలో ఎగ్జామ్ రాయలేకపోయిన విద్యార్థులకు ఈ నిర్ణయం మేలు చేయనుంది. సెప్టెంబర్ లో నిర్వహించిన పరీక్షకు 15 లక్షల 97 వేల మంది దరఖాస్తు చేసోకగా….85 నుంచి 90 శాతం మంది మాత్రమే హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతంలో తెలిపింది.