- లేబర్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్గా రాణి కుముదిని
హైదరాబాద్, వెలుగు: రిటైర్అయిన మరో ఐఏఎస్కు రాష్ట్ర ప్రభుత్వం రీ అపాయింట్మెంట్ ఇచ్చింది. లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్కు రాణి కుముదిని స్పెషల్ సీఎస్ గామరో రెండేండ్ల పాటు కొనసాగేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1988 బ్యాచ్కు చెందిన రాణి కుముదిని పదవీ కాలం జూన్ 30తో ముగిసింది. దీంతో అదే రోజు నుంచి ఆమె స్పెషల్ సీఎస్గా లేబర్ డిపార్ట్మెంట్లో రెండేండ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు ఐఏఎస్లకు ప్రభుత్వం రీ అపాయింట్మెంట్ ఇచ్చింది. పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్గా అధర్ సిన్హాకు రెండేండ్ల పాటు పోస్టింగ్ ఇచ్చింది.
ప్రొటోకాల్ సెక్రటరీగా ఉన్న అర్విందర్ సింగ్ను రీ అపాయింట్ చేసి.. రెండేండ్లు అదే హోదాలో కొనసాగిస్తోంది. మరోవైపు పోస్టింగ్లు లేకుండా ఉన్న యువ ఐఏఎస్లకు మాత్రం ఎలాంటి శాఖలు కేటాయించడం లేదు. ఇలా ఆరుగురు ఐఏఎస్లు ఉన్నట్లు తెలిసింది. కాగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కూడా శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఇటీవల ఆయనను రేరా చైర్మన్ గాప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్లోకేష్ కుమార్ను ఈసీ అడిషనల్ సీఈవోగా నియమించింది. ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ను కూడా ప్రభుత్వం జాయింట్ సీఈవోగా అపాయింట్ చేసింది. దీంతో ఈ మూడు పోస్టుల్లో ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నాలుగైదు డిపార్ట్మెంట్లు ఒక ఐఏఎస్ కిందనే ఉంటున్నాయి. ఈసారైనా మార్పులు చేస్తారా? లేదా? అని కొందరు ఐఏఎస్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.