
సికింద్రాబాద్, వెలుగు: వంద కిలోల గంజాయిని పట్టిస్తే రూ.2లక్షలు బహుమతి ఇస్తామని యాంటీ నార్కోటిక్బ్యూరో ఎస్పీ సాయిచైతన్య ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. డగ్స్, గంజాయికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్ఫ్రీ నంబర్ 87126 71111కు కాల్ చేయాలని, tsnabho-hyd@tspolice.gov.in , tsnabho-hyd@tspolice.gov.inకు మెయిల్చేయాలని కోరారు. బుధవారం సికింద్రాబాద్ నార్త్జోన్ డీసీపీ ఆఫీసులో డీసీపీ రష్మీ పెరుమాళ్ తో కలిసి ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
లంగర్ హౌజ్కు చెందిన మహ్మద్అక్రమ్, కార్ఖానాకు చెందిన సీఎస్ప్రణయ్, వెస్ట్మారేడుపల్లికి చెందిన రోహన్విలియమ్స్ఈజీ మనీ కోసం కాలేజీ స్టూడెంట్లను టార్గెట్చేసి గంజాయి విక్రయం మొదలుపెట్టారు. వీరితోపాటు వీరి వద్ద గంజాయిని కొంటున్న బోయిన్పల్లికి చెందిన భరణికుమార్(26), పద్మారావు నగర్కు చెందిన రోహన్సింగ్ఓసాహన్(28) జూబ్లీహిల్స్కు చెందిన విద్యార్థి ఆదిత్య నారాయణరెడ్డి(20), బంజారాహిల్స్కు చెందిన అర్జున్చౌదరి(19), జూబ్లీ హిల్స్కు చెందిన నిఖిల్రెడ్డి(20), సూర్యతేజ(29),రాయ్దుర్గంకు చెందిన సాయిచరణ్రెడ్డి(29), మలక్పేటకు చెందిన సాయి పృథ్వీనాథ్ రెడ్డి(20)ని అరెస్ట్చేసినట్లు ఏస్పీ సాయి చైతన్య వెల్లడించారు.
వీరు ఇచ్చిన సమాచారంతో షాద్నగర్ సింబయాసిస్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్లో గంజాయికి అలవాటుపడిన 20 మంది స్టూడెంట్లను గుర్తించామని చెప్పారు. సమావేశంలో నార్త్జోన్ అడిషనల్ డీసీపీ అశోక్, కార్ఖానా ఇన్స్పెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.