గంజాయిని పట్టిస్తే.. రూ.2లక్షల నజరానా

గంజాయిని పట్టిస్తే.. రూ.2లక్షల నజరానా

సికింద్రాబాద్, వెలుగు: వంద కిలోల గంజాయిని పట్టిస్తే రూ.2లక్షలు బహుమతి ఇస్తామని యాంటీ నార్కోటిక్​బ్యూరో ఎస్పీ సాయిచైతన్య ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. డగ్స్, గంజాయికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా టోల్​ఫ్రీ నంబర్​ 87126 71111కు కాల్ చేయాలని, tsnabho-hyd@tspolice.gov.in , tsnabho-hyd@tspolice.gov.inకు మెయిల్​చేయాలని కోరారు. బుధవారం సికింద్రాబాద్ నార్త్​జోన్ డీసీపీ ఆఫీసులో డీసీపీ రష్మీ పెరుమాళ్ తో కలిసి ఎస్పీ మీడియాతో మాట్లాడారు. 

లంగర్ హౌజ్​కు చెందిన మహ్మద్​అక్రమ్, కార్ఖానాకు చెందిన సీఎస్​ప్రణయ్, వెస్ట్​మారేడుపల్లికి చెందిన రోహన్​విలియమ్స్ఈజీ మనీ కోసం కాలేజీ స్టూడెంట్లను టార్గెట్​చేసి గంజాయి విక్రయం మొదలుపెట్టారు. వీరితోపాటు వీరి వద్ద గంజాయిని కొంటున్న బోయిన్​పల్లికి చెందిన భరణికుమార్(26), పద్మారావు నగర్​కు చెందిన రోహన్​సింగ్​ఓసాహన్(28) జూబ్లీహిల్స్​కు చెందిన విద్యార్థి ఆదిత్య నారాయణరెడ్డి(20), బంజారాహిల్స్​కు  చెందిన అర్జున్​చౌదరి(19), జూబ్లీ హిల్స్​కు చెందిన నిఖిల్​రెడ్డి(20), సూర్యతేజ(29),రాయ్​దుర్గంకు చెందిన సాయిచరణ్​రెడ్డి(29), మలక్​పేటకు చెందిన సాయి పృథ్వీనాథ్​ రెడ్డి(20)ని అరెస్ట్​చేసినట్లు ఏస్పీ సాయి చైతన్య వెల్లడించారు. 

వీరు ఇచ్చిన సమాచారంతో షాద్​నగర్​ సింబయాసిస్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్​లో గంజాయికి అలవాటుపడిన 20 మంది స్టూడెంట్లను  గుర్తించామని చెప్పారు. సమావేశంలో నార్త్​జోన్ అడిషనల్ డీసీపీ అశోక్, కార్ఖానా ఇన్​స్పెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.