
పద్మారావునగర్, వెలుగు: అధికంగా యాంటీ బయోటిక్స్ వాడటం ప్రమాదకరమని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. ఇందిరా అన్నారు. మంగళవారం గాంధీ మెడికల్ కాలేజీ మైక్రో బయోలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో వరల్డ్ ఏఎంఆర్ అవేర్నెస్ వీక్ సందర్భంగా యాంటీ బయోటిక్స్ మందుల వాడకంపై డాక్టర్లు గాంధీ ఆవరణలో అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్వాడకం వల్ల రెసిస్టెన్స్సమస్యలు ఏర్పడి, భవిష్యత్తులో మెడిసన్స్బాడీలో పనిచేయకుండా పోతాయన్నారు. ‘యూజ్రైట్డ్రగ్, రైట్డోస్, రైట్టైమ్’ అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గాంధీ సూపరింటెండెంట్ప్రొఫెసర్ రాజకుమారి, మైక్రో బయాలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ సురేఖ, వైస్ ప్రిన్సిపాల్ డా. రవిశేఖర్ రావు, ఆర్ఎంవోవన్ శేషాద్రి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ఆఫీసర్ డాక్టర్ పూజ, ఎంపీహెచ్ఓ వేణుగోపాల్ గౌడ్, డాక్టర్లు, మెడికోలు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.