ఢిల్లీలో హాకీ వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్

ఢిల్లీలో హాకీ వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్

కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ హాకీ వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. హాకీ ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండువసారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 16 విభిన్న జట్లతో తాము పోటీపడతామన్నారు. 41 ఏండ్ల విరామం తర్వాత టోక్యో ఒలింపిక్స్ లో తమ జట్టు పతకం సాధించిందని అనురాగ్ ఠాగూర్ తెలిపారు.

 

హాకీ వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరణ ఢిల్లీలోని థ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జనవరి 13 నుంచి 29 వరకు ఒడిశాలో హాకీ వరల్డ్ కప్ జరగనుంది.