బిడ్డతో తొలిసారి పెళ్లి రోజు జరుపుకున్న విరుష్క జంట

బిడ్డతో తొలిసారి పెళ్లి రోజు జరుపుకున్న విరుష్క జంట

నాలుగేండ్ల క్రితం ఇదే రోజున క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒక్కటయ్యారు. మూడు ముళ్ల బంధంతో జంటగా మారిన ఈ క్యూట్ కపుల్ పెళ్లి రోజు సందర్భంగా సోషల్ మీడియా పోస్ట్‌తో తమ ప్రేమను పరస్పరం వ్యక్తం చేశారు. కొన్ని సిల్లీ జోకులు, మరికొన్ని ప్రేమ కవిత్వాలతో ఇద్దరూ పెండ్లి రోజున విష్ చేసుకున్నారు. తమ క్యూట్ ఫొటోలు, సరదా సన్నివేశాల జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. అలాగే తమ బిడ్డ వామిక పుట్టాక వచ్చిన తొలి పెళ్లి రోజు కావడంతో ఆ చిన్నారిని ఎత్తుకుని ఉన్న ఫొటోను విరాట్ పోస్ట్ చేశాడు. భర్త విరాట్‌కు ఇష్టమైన సాంగ్ లిరిక్స్‌ లైన్స్ రాసి.. తన ప్రేమను ఇన్‌స్టా పోస్టులో వ్యక్తం చేసింది అనుష్క. అయితే తన బద్ధకాన్ని, సిల్లీ జోక్స్‌ను, పిచ్చి చేష్టలను నాలుగేళ్లుగా భరిస్తూ ప్రతి రోజూ ప్రేమను అందిస్తున్నావంటూ విరాట్‌ తన ఇన్‌స్టా పోస్టులో అనుష్కను ప్రేమతో ముంచెత్తాడు. ప్రపంచమంతా తనకు వ్యతిరేకంగా ఉన్న తన వెంట ఉంటో ఎంతో ప్రేమను పంచిన ధైర్యవంతురాలైన మహిళ నువ్వు అని పోస్ట్ చేశాడు. అన్ని రకాలుగా పరిపూర్ణంగా మార్చింది నువ్వే.. ఒక కుటుంబంగా ఇదే మన తొలి మ్యారేజ్‌ డే అంటూ విరాట్ ముగించాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)