
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో భాగంగా ఉదయం 10.30 గంటలకు కృష్ణా జిల్లా నందిగామలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు నర్సాపూర్లో ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3.55 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో, సాయంత్రం 5.15 గంటలకు పిఠాపురంలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. సాయంత్రం 6.15 గంటలకు కాకినాడ రూరల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు.