40 వేలు దాటిన కేసుల సంఖ్య
24 గంటల్లో 42 మంది మృతి
అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మృతుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 2602 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 40వేలు దాటింది. 24 గంటల్లో 42 మంది చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 534కి చేరింది. 20,298 మంది డిశ్చార్జ్ కాగా.. 19,814 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో 20,245 శ్యాంపిల్స్ను టెస్ట్ చేశారు.