OTT Review: హనీమూన్ జంటలతో కోట్ల బ్లాక్‌మెయిల్.. ఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందేనా?

OTT Review: హనీమూన్ జంటలతో కోట్ల బ్లాక్‌మెయిల్.. ఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందేనా?

తమిళ బ్లాక్‌బస్టర్ ‘రాజా రాణి’ ఫేమ్ హీరో జై (Jai) ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘సత్తెంద్రుడు మారుదు వానిలై’ (Sattendru Maarudhu Vaanilai). బాబు విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి గోవిందరాజన్, యోగిబాబు, శ్రీమన్ కీలక పాత్రలు పోషించారు. మే 15న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ఆహా, ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఒకవైపు 300 ఎకరాల భూమి కోసం నడిచే ప్రేమ నాటకం, మరోవైపు హనీమూన్ జంటలను టార్గెట్ చేస్తూ సాగే కోట్ల రూపాయల బ్లాక్‌మెయిల్ వ్యవహారం.. ఇలా ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్విస్టులు, సస్పెన్స్, యాక్షన్ అంశాలతో సాగిన ఈ మూవీకి ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. 

కథేంటంటే:

జానకి (మీనాక్షి గోవిందరాజన్) చదువుకున్న అమ్మాయి. ఆమెపై కన్నేసిన ఓ రాజకీయ నాయకుడు, జానకి తండ్రికి పదవి ఇప్పిస్తానని ఆశ చూపి, అతని కూతురిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. తండ్రి కూడా ఇందుకు సిద్ధపడటంతో, ఆ పెళ్లి ఇష్టం లేని జానకి ఇల్లు విడిచి వెళ్లిపోతుంది. ఇదే సమయంలో రణేశ్ ఆమెకు దగ్గరవడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే జానకి పేరుపై ఉన్న మూడు వందల ఎకరాల భూమి కోసమే అతడు ప్రేమ నాటకం ఆడుతున్నాడని ఆమె గ్రహిస్తుంది. ఆ పరిస్థితుల్లో జానకికి రామచంద్రన్ (జై) పరిచయమవుతాడు.

రణేశ్ వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ఆమె రామచంద్రన్‌‌ను పెళ్లి చేసుకుంటుంది. అనాథగా శరణాలయంలో పెరిగిన రామచంద్రన్ సాఫ్ట్‌‌వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తుంటాడు. రామచంద్రన్‌‌కు చక్రవర్తి (గరుడ రామ్) పరిచయమవుతాడు. అయితే, చక్రవర్తి కొత్త జంటల కోసం రిసార్ట్స్ నిర్వహిస్తూ, పడక గదుల్లోని శృంగార సన్నివేశాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించి కోట్ల రూపాయల బ్లాక్‌మెయిల్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ ఉచ్చులో రామచంద్రన్, జానకి ఎలా చిక్కుకున్నారు? అందులోంచి వారు ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:

రొమాన్స్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ దర్శకుడు బాబు విజయ్ తెరకెక్కించిన 'సత్తెంద్రుడు మారుదు వానిలై' ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ అంశాలను మేళవిస్తూ దర్శకుడు బాబు విజయ్ తెరకెక్కించిన ‘సత్తెంద్రుడు మారుదు వానిలై’ ఆసక్తికరంగా సాగుతుంది. 300 ఎకరాల భూమి కోసం జరిగే ప్రేమ నాటకం, హనీమూన్ జంటలను టార్గెట్ చేస్తూ సాగిన బ్లాక్‌మెయిల్ ఎపిసోడ్స్ కథకు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ఫస్ట్ హాఫ్‌లో కథనం నెమ్మదిగా మొదలైనా, ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి.

జానకి పాత్ర చుట్టూ నడిచే కథ, ఆమె ఎదుర్కొనే సమస్యలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్టులు కథపై మరింత క్యూరియాసిటీని పెంచుతాయి. సెకండాఫ్‌లో యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. కొన్ని ట్విస్టులు ఊహించదగ్గవిగా ఉన్నప్పటికీ, క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌ను కొనసాగించడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. రామచంద్రన్ పాత్రలో జై తనదైన నటనతో ఆకట్టుకోగా, జానకిగా మీనాక్షి గోవిందరాజన్ సహజమైన నటన కనబరిచారు.