హనుమాన్ ఆలయంలో కుప్పకూలిన మండపం.. ఆరుగురు స్పాట్ డెడ్.. శిథిలాల కింద 40 మంది భక్తులు

హనుమాన్ ఆలయంలో కుప్పకూలిన మండపం.. ఆరుగురు స్పాట్ డెడ్.. శిథిలాల కింద 40 మంది భక్తులు

పర్భానీ: మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. యశ్వాది దేవస్థాన్‌లోని హనుమాన్ ఆలయ మండపం పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఆరు మృతదేహాలను ఇప్పటికి వెలికితీశారు. సుమారు 30-40 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.

గాయపడిన 10 మందిని ఆసుపత్రికి తరలించారు. ఆలయానికి సరిగ్గా ఎదురుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మధ్యాహ్నం పూజల సమయంలో ప్రజలు ప్రసాదం స్వీకరిస్తుండగా.. ఆ నిర్మాణం అకస్మాత్తుగా కూలిపోయింది.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటపడింది. ఈ ఘటన మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో జరిగింది. శనివారం కావడంతో ఆలయం జనంతో కిక్కిరిసిపోయింది. కీర్తన, మహాప్రసాదం స్వీకరించడానికి జనాలు బారులు తీరారు. ప్రమాదం జరిగిన అనంతరం, పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు.