ప్రాణం తీసిన బెట్టింగ్ : TDP గెలుస్తుందని రూ.8 లక్షలు కాశాడు

ప్రాణం తీసిన బెట్టింగ్ : TDP గెలుస్తుందని రూ.8 లక్షలు కాశాడు

వెస్ట్ గోదావరి : కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్ లకు మించి ఏపీలో పొలిటికల్ బెట్టింగ్ లు జోరుగా కాసారు పందెం రాయుళ్లు. వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ నేత ఒకరు తన ఆస్తిని మొత్తం బెట్టింగ్ వేస్తానని చెప్పడం ఫలితాలకు ముందు హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలోనే నేతల బెట్టింగులు ఊపందుకున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా తమ పార్టీలపై నమ్మకంతో భారీగా బెట్టింగ్ వేశారు. అయితే ఓ పందెం ఓ వ్యక్తి ప్రాణం తీసింది.

TDP గెలుస్తుందని రూ.8లక్షల పందెం కట్టి.. తీరా ఆ పార్టీ ఓడిపోవడంతో మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు ఉండ్రాజవరం మండలం వెలివెన్ను గ్రామానికి చెందిన కంఠంనేని వీర్రాజు(40) అనే వ్యక్తి.. తెలుగుదేశం గెలుస్తుందని రూ. ఎనిమిది లక్షల పందెం కాశాడు. తీరా ఆ పార్టీ ఓడిపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కన్నీరుమున్నీరయ్యారు మృతుడి కుటుంబసభ్యులు. పనికిరాని పందెంల జోలికి పోయి ప్రాణాలు తీసుకున్నాడని తెలిపారు పోలీసులు.