బాబు ప్రారంభించిన వెబ్ సైట్ పేరు మార్చిన జగన్

బాబు ప్రారంభించిన వెబ్ సైట్ పేరు మార్చిన జగన్

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన ‘స్పందన’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలు తమ ఫిర్యాదులు, అభ్యర్ధనలను అధికారులకు విన్నవించుకుంటున్నారు. ఇదిలా ఉంటే  2015 లో అప్పటి  తెలుగు దేశం ప్రభుత్వం ప్రజల కోసం ప్రారంభించిన ‘మీకోసం’ అనే వెబ్ సైట్ ను ఇకపై  ‘స్పందన- ప్రజా సమస్యల పరిష్కార వేదిక’గా మారనుంది. అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించిన మీకోసం వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి జగన్ స్పందన గా మార్చాలని అధికారులకు ఆదేశమిచ్చినట్లు సమాచారం.

ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ .. ‘స్పందన’ కార్యక్రమానికి ప్రజలు వెల్లువెత్తుతుండడంతో.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు అప్పటి ‘మీ కోసం’ వెబ్ సైట్ ను ప్రస్తుతం ‘స్పందన’ గా మార్చేశారు అధికారులు.  దీనికి 24 గంటలపాటు పనిచేసే కాల్‌సెంటర్‌ను అనుసంధానం చేయనున్నారు. స్పందన కోసం కొత్తగా 1800-425-4440 టోల్‌ ఫ్రీ నంబరు, spandana.ap@gmail.com మెయిల్‌ను కేటాయించారు. ఈ రెండూ మరో వారం, పది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం https://www.meekosam.ap.gov.in/  క్లిక్ చేయండి