అమరావతి : గ్రామ వాలంటీర్ల నియామకం కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు 11 జిల్లాల కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు. నెల్లూరు, ప్రకాశం మినహా అన్ని జిల్లాల్లో ప్రకటనలు వచ్చాయి.
11 వేల 77 పంచాయతీల్లో 1 లక్షా 56 వేల 437 వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. సగటున ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రభుత్వం నియామకాలు చేపట్టనుంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1072 పంచాయతీల్లో 21 వేల 600 వాలంటీర్లను నియమించనున్నారు.
జిల్లాల వారీగా వాలంటీర్ల వివరాలు :
పశ్చిమగోదావరి జిల్లా – 17,881
శ్రీకాకుళం – 11,924
విజయనగరం – 10,012
విశాఖ జిల్లా – 12, 272
గుంటూరు – 17, 550
కృష్ణా – 14 వేలు
అనంతపురం – 14, 007
చిత్తూరు – 15, 824
కర్నూలు – 12, 045
కడప – 9, 322
రేపటి నుంచి (జూన్ 24 సోమవారం) జులై 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. అభ్యర్థులు gramavolunteer.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి శిక్షణానంతరం ఆగస్టు 15 నుంచి బాధ్యతలు అప్పగించనున్నారు.