చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై నేడు(అక్టోబర్ 19) ఎపి హైకోర్టులో విచారణ

చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై నేడు(అక్టోబర్ 19) ఎపి హైకోర్టులో విచారణ

చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై 2023, అక్టోబర్ 19వ తేదీ గురువారం ఎపి హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో 41 రోజులుగా ఉంటున్న చంద్రబాబు రిమాండ్ ఈరోజుతో ముగుస్తుంది. దీంతో చంద్రబాబును విజయవాడలోని ఏసీబీ కోర్టులో వర్చువల్ గా హాజరుపర్చనున్నారు.

Also Read :- వచ్చేనెల 15 నుంచి ఏపీలో కులగణన

చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించడంతో.. ఆయన రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 2023, అక్టోబర్ 17వ తేదీన ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. బెయిల్ పిటీషన్ విచారణను ఈరోజుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.