శివాజీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు : పోసాని

శివాజీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు : పోసాని

హైదరాబాద్ : సినీ నటుడు శివాజీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని  విమర్శించారు పోసాని కృష్ణమురళీ. ఆదివారం శివాజీ  ఇచ్చిన దృశ్య రూప ప్రదశ్శనపై పోసాని కౌంటర్ ఇచ్చారు. గతంలో చంద్రబాబును దయ్యమని తిట్టిన శివాజీకి అంతలోనే దేవుడెలా అయ్యాడని ప్రశ్నించారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతాడన్నారు పోసాని. చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని  నమ్మోద్దని సూచించారు. ఎన్టీఆర్ చావుకు ప్రధాన కారకుడు చంద్రబాబేనని ఆరోపించారు.

చంద్రబాబు ఎలాంటి వ్యక్తో.. జగన్ ఎలాంటి వ్యక్తో చూసి ఓటేయాలని ఏపీ ప్రజలను కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి.. ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు లాక్కున్నారని..
జగన్‌ మొదటి నుంచి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇచ్చిన మాటను ఏనాడూ జగన్‌ మోహన్‌ రెడ్డి తప్పలేదన్న పోసాని.. హోదాపై అనేకసార్లు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు.

మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసమే జగన్‌ పోరాడారని.. జగన్ మంచివాడు కాదని పవన్ నిరూపిస్తే.. తాను పవన్ కల్యాణ్‌ ని సమర్థిస్తా అన్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబును విమర్శించకుండా పవన్.. జగన్‌ ను విమర్శిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయి జగన్‌ పై కేసులు పెట్టించారని తెలిపారు. చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మకండి. చంద్రబాబుకు కులపిచ్చి ఎక్కువ.. అని తెలిపారు పోసాని.