చండీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ నామినేషన్ దాఖలు చేశారు. ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పంజాబ్ లో చరిత్ర సృష్టించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. సామాన్యుల సమస్యలన్ని ఆప్ పరిష్కరించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. ధురి ప్రజలు తనను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మాన్ ధీమా వ్యక్తం చేశారు.
Aam Aadmi Party's (AAP) CM face and candidate from Dhuri, Bhagwant Mann arrives at the SDM office here to file nomination for the #PunjabElections2022 pic.twitter.com/bUz3ILXjlP
— ANI (@ANI) January 29, 2022