APPSC నిర్వాకం.. 150 మంది అభ్యర్థులు పరీక్షకు దూరం

APPSC నిర్వాకం.. 150 మంది అభ్యర్థులు పరీక్షకు దూరం

ఏపీపీ ఎస్సీ అధికారుల నిర్వాకం వల్ల 150 మంది అభ్యర్థులు పంచాయతీ కార్యదర్శి పరీక్షకు దూరమయ్యారు. ఏపీపీఎస్సీ  పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఆదివారం నిర్వహించింది. అయితే హాల్ టికెట్లలో  విశాఖలోని ఎస్.రాయపురం తిమ్మాపురంకు బదులుగా హాల్ టికెట్ పై భీమిలిలోని తిమ్మాపురాన్ని ముద్రించారు. దీంతో తిమ్మాపురం వెళ్లిన అభ్యర్థులు అక్కడ తమ పేర్లు లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా హాల్ టికెట్ ప్రింట్ చేసే సమయంలో తప్పు జరిగిందని చెప్పారు.