గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు..ఈ నెల 12 వరకు గడువు

గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు..ఈ నెల 12 వరకు గడువు

ఈ నెల 28న అడ్మిషన్ టెస్ట్ హైదరాబాద్, వెలుగు : తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫులే బీసీ సంక్షేమ (ఎంజేపీటీబీసీడబ్ల్యూ), ఎస్సీ (టీఎస్‌‌డబ్ల్యూ)సంక్షేమ, ఎస్టీ (టీటీడబ్ల్యూ) సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024–-25 అకడమిక్ ఇయర్ లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్‌‌ విడుదలైంది. ఇందుకు సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్లకు ఉమ్మడి ప్రవేశపరీక్ష- ఆర్‌‌డీసీ సెట్‌‌-2024 నిర్వహించనున్నారు. 

ఈ పరీక్ష ద్వారా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు జరగనున్నాయి. ఇంటర్ సెకండియర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా tsrdccet.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని  సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఓ పత్రిక ప్రకటనలో వెల్లడించింది.ఈ నెల 28న అర్హత పరీక్ష ఉండగా ఈ నెల 21 నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.