ఎప్ సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ షురూ

ఎప్ సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ షురూ
  •     తొలిరోజు 94% మంది అటెండ్ 

హైదరాబాద్,వెలుగు: టీఎస్ ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ర్టీమ్ ఎగ్జామ్స్ షురూ అయ్యాయి. గురువారం రెండు విడుతల్లో పరీక్ష జరగ్గా, 94 శాతం మంది అటెండ్ అయ్యారని ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఫస్ట్ సెషన్ లో 50,978 మంది అటెండ్ కావాల్సి ఉండగా 48,076 మంది, సెకండ్ సెషన్ లో 50,983 మందికి 48,152 మంది హాజరయ్యారు. ఎప్ సెట్ ఇంజినీరింగ్ పరీక్షలు శుక్రవారం, శనివారం కూడా జరగనున్నాయి.  కాగా, రాష్ట్రంలో ఆన్​లైన్​లో ఒకేరోజు లక్ష మందికి పైగా పరీక్షలు రాయడం ఇదే తొలిసారి కావడం విశేషం. పలు పరీక్షా కేంద్రాలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్,  జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి తదితరులు సందర్శించారు.