బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ జవాన్లకు నివాళిగా ఏఆర్‌‌‌‌‌‌‌‌ రెహమాన్‌‌‌‌ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌

బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ జవాన్లకు నివాళిగా ఏఆర్‌‌‌‌‌‌‌‌ రెహమాన్‌‌‌‌ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌

పంజాబ్‌‌‌‌లోని వాఘా– అట్టారీ బోర్డర్‌‌‌‌‌‌‌‌ వద్ద ఆస్కార్ విన్నర్‌‌‌‌‌‌‌‌ ఏఆర్‌‌‌‌‌‌‌‌ రెహమాన్‌‌‌‌  లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌‌‌‌ నిర్వహించారు. ‘మై వాప‌‌‌‌స్ అవూంగా’ మూవీ ప్రమోషన్స్‌‌‌‌లో భాగంగా బోర్డర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ఫోర్స్‌‌‌‌ (బీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌) త్యాగాలకు నివాళిగా నిర్వహించిన ఈ కాన్సర్ట్‌‌‌‌లో పలు దేశభక్తి పాటలు పాడారు రెహమాన్ టీమ్. ఆయనతో పాటు  సింగ‌‌‌‌ర్ మోహిత్ చౌహ‌‌‌‌న్‌‌‌‌, డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇంతియాజ్ అలీ,  హీరో వేదాంగ్‌‌‌‌ రైనా పాల్గొన్నారు. 

ఇండియా - పాకిస్థాన్ దేశ‌‌‌‌విభ‌‌‌‌జ‌‌‌‌న నేప‌‌‌‌థ్య కథతో ‘మై వాపస్‌‌‌‌ అవూంగా’ సినిమా వస్తోంది. దిల్జీత్‌‌‌‌ దోసంజ్, నసీరుద్దీన్ షా, వేదాంగ్ రైనా, శర్వరీ లీడ్ రోల్స్‌‌‌‌లో ఇంతియాజ్‌‌‌‌ అలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  రెహమాన్‌‌‌‌ సంగీతం అందించారు.  జూన్‌‌‌‌ 12న  సినిమా విడుదలవుతోంది.