24 గంటల కరెంట్​ఎక్కడిస్తున్నరు?.. రైతులు ఆందోళన

24 గంటల కరెంట్​ఎక్కడిస్తున్నరు?..  రైతులు ఆందోళన

మఠంపల్లి, వెలుగు : కరెంట్ సరఫరా సరిగ్గా చేయడం లేదంటూ సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 24 గంటల కరెంట్​సరఫరా చేయడం లేదంటూ బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం 24 గంటల కరెంట్​ఇవ్వడం లేదని, 16 గంటలు మాత్రమే ఇస్తోందని అది కూడా 10 నుంచి 15 సార్లు కట్ చేస్తూ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసే వరకు రాస్తారోకో విరమించేది లేదన్నారు.  రెండు వైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ఏఈ హరేశ్వర్ రెడ్డి వచ్చి రైతులతో మాట్లాడారు. అంతరాయం లేకుండా కరెంట్​సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.