రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి, అతని భార్యపై దాడి చేసిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్నాబ్ గోస్వామి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించారు.
ఆ విమర్శల తరువాత ఆర్నాబ్ అతని భార్యపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంక్ బాటిళ్ల తో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దాడికి ప్రయత్నించిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 504, 341 కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి అనంతరం నిందితుల్ని అరెస్ట్ చేసే సమయంలో నిందితులు ఆర్నాబ్ గోస్వామి అసలు జర్నలిస్టే కాదని, మొదట మీరు ఆ విషయం గురించి తెలుసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యల్ని ఏఎన్ ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
One of the two attackers while boarding the police jeep last night, says about Arnab “he is not a journalist, first of all you should know it”. As if that justifies accosting any citizen and his wife, throwing ink (probably) on his car. pic.twitter.com/p7IHOh6GU2
— Smita Prakash (@smitaprakash) April 23, 2020