న్యూఢిల్లీ: కరోనా క్రైసిస్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని దేశ రాజధానిలో పలువురు పోస్టర్లు అతికించడం వివాదాస్పదమైంది. ఈ పోస్టర్లు అతికించిన వారిని పోలీసులు అరెస్టు చేయడంతో వివాదం మరింత పెద్దదైంది. ఈ విషయంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు.
పోస్టర్లు వేసిన వారిని అరెస్టు చేయడం మీద రాహుల్ భగ్గుమన్నారు. ఇది సరికాదని, ప్రశ్నిస్తే అదుపులోకి తీసుకుంటారా అని ఫైర్ అయ్యారు. మోడీజీ.. మన పిల్లలకు ఇవ్వాల్సిన టీకాలను విదేశాలకు ఎందుకు పంపారంటూ రాహుల్ ప్రశ్నించారు. తనను కూడా అరెస్ట్ చేయమని ట్వీట్ చేశారు. కాగా, మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పోస్టర్లు అతికించినందుకు గత కొన్ని రోజుల్లో దాదాపు 17 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
Arrest me too.
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2021
मुझे भी गिरफ़्तार करो। pic.twitter.com/eZWp2NYysZ