సాగర్ రాణా అనే యువ రెజ్లర్ హత్య కేసు ఆరోపణలలో అరెస్టైన అయిన రెజ్లర్ సుశీల్ కుమార్ ను నార్తర్న్ రైల్వే సస్పెండ్ చేయనుంది. నార్తర్న్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్గా ఉన్న ఒలింపిక్ పతక విజేత సుశీల్ను స్కూల్ స్థాయిలో క్రీడల అభివృద్ధి కోసం ఛత్రసాల్ స్టేడియంలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ(OSD) గా ఢిల్లీ ప్రభుత్వం నియమించింది.
హత్యకేసుకు సంబంధించి FIR నమోదైనట్లు ఢిల్లీ ప్రభుత్వం.. రైల్వే బోర్డుకు నివేదిక ఇచ్చింది. దీంతో సుశీల్ కుమార్ పై వేటు వేసేందుకు సిద్ధమవుతోందని నార్తర్న్ రైల్వే సీపీఆర్వో దీపక్ కుమార్ తెలిపారు. రెండు రోజుల్లో ఆయనను సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.