ఎన్నికలకు మేం సిద్ధం.. మోదీ ట్వీట్

ఎన్నికలకు మేం సిద్ధం.. మోదీ ట్వీట్

దేశ వ్యాప్తంగా  ఎన్నికల షెడ్యూల్ వెలువడటంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండగ. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం. మా ట్రాక్ రికార్డు బాగుంది. మేం చేసిన పనులే గెలిపిస్తాయి. దేశంలో ఎక్కడ చూసినా ప్రజలు ఒక్కటే చెబుతున్నారు. అబ్‌కి బార్ 400 పార్. ప్రతిపక్షాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయి. ఈసారి కూడా వాళ్లకు ఓటమి తప్పదు’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు  ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించి జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు.   ఏపీలో  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. 

అభ్యర్థులు మే 11 సాయంత్రం 5 గంటలకు వరకు ప్రచారం చేసుకోవచ్చు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. దాదాపు 2 నెలల పాటు రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగనుంది. ఇక తెలంగాణలో కూడా ఒకే దశలో మే 13న పార్లమెంట్ఎన్నికలు జరగనున్నాయి.  సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా అదే రోజున ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.